ఎన్‌ఆర్‌ఐల ప్రత్యేక కేంద్రాన్ని మోదీ ప్రారంభించారు...

- October 02, 2016 , by Maagulf
ఎన్‌ఆర్‌ఐల  ప్రత్యేక కేంద్రాన్ని మోదీ ప్రారంభించారు...

దేశాభివృద్ధిలో ప్రవాస భారతీయుల పాత్ర ఎంతో కీలకమైనదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభిప్రాయపడ్డారు. ఎన్‌ఆర్‌ఐల కోసం ప్రత్యేక కేంద్రాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. ప్రవాస భారతీయుల కోసం నిర్వహించిన పోటీల్లో గెలిచినవారికి ఆయన బహుమతులు అందించారు. గాంధీ జయంతి రోజున ఎన్‌ఆర్‌ఐ కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని మోదీ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీ దేశం విడిచి విదేశాలకు వెళ్లారని...కానీ దేశ వాసుల పిలుపు అందుకుని తిరిగివచ్చేశారని అన్నారు. ప్రపంచ దేశాలకు వెళ్లే ప్రతి భారతీయుడికీ ఇంతకంటే గొప్ప ప్రేరణ మరొకటి ఉండదని ఆయన అన్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com