విడుదలైన స్వచ్ఛ్‌భారత్‌ స్మారక స్టాంపులు

- October 02, 2016 , by Maagulf
విడుదలైన స్వచ్ఛ్‌భారత్‌ స్మారక స్టాంపులు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ్‌భారత్‌ మిషన్‌ ప్రారంభించి ఆదివారంతో రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం స్మారక స్టాంపులను విడుదల చేసింది. 10 నుంచి 14 వయసు ఉన్న చిన్నారులు కొంత మంది ఈ స్మారక స్టాంపులను డిజైన్‌ చేయడం విశేషం.. స్వచ్ఛ్‌భారత్‌ మిషన్‌, తపాలా శాఖ జాతీయవ్యాప్తంగా పోస్టల్‌ స్టాంపులకు సంబంధించిన డిజైన్లు పంపించమని పోటీను నిర్వహించింది. ఈ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ డిజైన్లను పంపించినట్లు కేంద్ర మంత్రి మనోజ్‌ సిన్హా వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com