చైనా లో కలకలం రేపిన యువకుడు
- October 03, 2016
చైనాలో ఘోరం జరిగింది. యునాన్ ఫ్రావిన్స్ రాజధాని కున్ మింగ్లో చిరు ఉద్యోగం చేస్తున్న యాంగ్ జింగ్ పె (27) అనే యువకుడు తల్లి దండ్రులతో సహా 19 మంది అత్యంత దారుణంగా హతమార్చాడు. మృతుల్లో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. వివరాల్లోకి వెళితే... 1989లో జన్మించిన యాంగ్ జింగ్ పె అనే యువకుడు చెడు అలవాట్లకు బానిస అయ్యాడు. దీంతో స్నేహితుల వద్ద అప్పులు చేశాడు. అవి తీర్చాలంటూ వారంతా ఒత్తిడి చేయడంతో డబ్బు కోసం సొంత ఊరికి వెళ్లాడు. తాను చేసిన అప్పులు తీర్చాలని తల్లిదండ్రులను ఒత్తిడిపై పెంచాడు. అయితే వ్యసనాల బారిన పడిన కుమారుడి అప్పులు తీర్చేందుకు వారు అంగీకరించలేదు. దీంతో కోపోద్రిక్తుడైన యాంగ్ జింగ్ పె తల్లిదండ్రులిద్దర్నీ అత్యంత దారుణంగా హత్య చేశాడు. అయితే పోలీసు విచారణలో తన వివరాలు పక్కింటి వాళ్లు చెప్పే అవకాశం ఉందని భావించి వారిని కూడా చంపేశాడు. ఇలా తనను అనుమానించే ప్రతి ఒక్కరినీ అత్యంత దారుణంగా హతమార్చాడు. ఇలా ముగ్గురు చిన్నపిల్లలు సహా మొత్తం 19 మందిని హత్య చేశాడు. అనంతరం తనకు ఏమీ తెలియనట్టు తన గ్రామం కున్ మింగ్ నుంచి మరొక ప్రాంతానికి వెళ్లిపోయాడు. కాగా చైనాలో వరుసగా హత్యలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా 'యాంగ్ జింగ్ పె'ను అనుమానితుడిగా తీసుకుని తమదైన శైలిలో విచారించగా 19 మందిని హత్య చేసినట్టు అంగీకరించాడు. దీంతో పోలీసు షాక్కు గురయ్యారు. దీంతో అతనికి మరణశిక్ష విధించే అవకాశం ఉందని సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







