'మరో దృశ్యం' షూటింగ్ ప్రారంభo...
- October 03, 2016
కట్ల రాజేంద్రప్రసాద్ దర్శకత్వంలో ఆర్.ఎమ్. మూవీ మేకర్స్ సంస్థ 'మరో దృశ్యం' అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. గౌతమ్, శ్వేత జంటగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ సోమవారం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. 'మా' అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నెల 15 నుంచి సూర్యాపేట పరిసరాల్లో చిత్రీకరణ జరుపుతామని దర్శకుడు రాజేంద్రప్రసాద్ చెప్పారు. నేరాలు, ఘోరాలు లేని భారతదేశం ఆవిష్కృతమవ్వాలనే కథాంశంతో సినిమా చేస్తున్నామన్నారు. 'వీరనారి చాకలి ఐలమ్మ' చిత్రాన్ని నిర్మించిన తాను ఈ చిత్రానికి సహకారం అందిస్తున్నాననీ, ఓ పాత్రను కూడా పోషిస్తున్నాననీ సోమిరెడ్డి తెలిపారు.తమకిది తొలి చిత్రమని హీరో హీరోయిన్లు తెలిపారు. షఫి, కాదంబరి కిరణ్కుమార్, అన్నపూర్ణ, కవిత, ప్రభావతి, చిట్టిబాబు, తిరుపతి ప్రకాశ, వినోద్, జానన్న, కృష్ణన్న, శ్రీహరి తారాగణమూన ఈ చిత్రానికి పాటలు: జయసూర్య, ఛాయాగ్రహణం: భాస్కర్ల మురళి, ఫైట్స్: సుబ్బు, కథ, మాటలు, స్ర్కీనప్లే, సంగీతం, కొరియోగ్రఫీ: కట్ల రాజేంద్రప్రసాద్.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







