ఒమన్‌లో అమ్నెస్టీ కోరుతున్న వలస కార్మికులు

- October 03, 2016 , by Maagulf
ఒమన్‌లో అమ్నెస్టీ కోరుతున్న వలస కార్మికులు

మస్కట్‌: తాము ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో తమపై అమ్నెస్టీ చూపాలంటూ ఇల్లీగల్‌ ఇమ్మిగ్రెంట్స్‌ ఒమన్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. తమపై దయ చూపిస్తే, తాము స్వదేశానికి వెళ్ళిపోతామని వారంతా కోరుతున్నారు. వీరిలో ఎక్కువమంది బంగ్లాదేశ్‌కి చెందినవారే ఉన్నారు. అక్రమంగా దేశంలో నివసిస్తున్నవారికి ప్రభుత్వం ప్రతి నెలా జరీమానాలు విధిస్తూ వస్తోంది. అయితే ఆ జరీమానాలు చెల్లించలేని దయనీయ స్థితిలో ఉన్నామని అక్రమ వలసదారులు వాపోతున్నారు. పని లేక, ఆదాయం లేక దయనీయంగా తమ జీవితాల్ని వెల్లదీస్తున్నట్లు వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని చూసి బంగ్లాదేశ్‌ ఎంబసీ, అత్యవసరంగా అమ్నెస్టీ అవసరమని అభిప్రాయపడుతోంది. ఒమన్‌ని విడిచి వెళ్ళేందుకే వేలాది రియాల్స్‌ చెల్లించాల్సిన పరిస్థితి కొందరికి ఏర్పడిందని బంగ్లాదేశ్‌ ఎంబసీకి చెందిన అధికారి ఒకరు పేర్కొన్నారు. అమ్నెస్టీ ద్వారా, వలస కార్మికులు ఎలాంటి జరీమానాలు చెల్లించకుండా స్వదేశానికి వెళ్ళే అవకాశం ఉంది. మే 3, 2015న చివరిసారిగా అమ్నెస్టీని అనౌన్స్‌ చేశారు. మూడు నెలలపాటు అది అమల్లో ఉంది. ఆ సమయంలో 23,653 మంది వలసకార్మికులు ఒమన్‌ని వీడారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com