ఢిల్లీలో భద్రతను పెంచారు...
- October 05, 2016
దసరా ఉత్సవాల్లో ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని ఇంటిలిజెన్స్ సమాచారం ఇవ్వడంతో దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. భద్రతను పటిష్టం చేశారు. నవరాత్రి ఉత్సవాలు వేగం పుంజుకున్నాయి. ఢిల్లీలోని ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. రాంలీలా కోసం ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఇదే అదునుగా చూసుకుని దాడి చేసుందుకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు వ్యూహరచన చేసుకున్నారని ఇంటిలిజెన్స్ నివేదికలు చెబుతున్నాయి. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్కు కూడా ఉగ్రవాదుల సంచారానికి సంబంధించిన సమాచారం అందింది. పక్షం రోజుల క్రితం దేశంలోకి ప్రవేశించిన కొందరు ఉగ్రవాదులు ఢిల్లీ వైపు కదిలారని సారాంశం. దీంతో ఢిల్లీ పోలీస్ శాఖలోని స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ బృందం అప్రమత్తం అయింది.సరిహద్దులో భారత ఆర్మీ నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్కు ప్రతీకారం తీర్చుకోవాలని కొన్ని ఉగ్రవాద సంస్థలు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో భద్రతను పెంచారు. రాష్ట్రపతి భవన్, పార్లమెంట్ హౌస్, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న ప్రదేశాలు, కేజ్రీవాల్ కార్యాలయం, ఇండియాగేట్, విమానాశ్రయాలు, ప్రధాన కూడళ్లలో, వివిధ ఆలాయాలవద్ద కూడా భద్రతను పటిష్టం చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









