ఇద్దరు జర్నలిస్టులకు బెయిల్
- October 12, 2016
ఒమన్: ఒమన్ కోర్టు ఇద్దరు జర్నలిస్టులకు బెయిల్ మంజూరు చేసింది. విచారణ నవంబర్ 7కి వాయిదా వేసింది. ఇద్దరికీ 2,000 రియాల్స్ (5,195) పూచీ కత్తు సమర్పించిన తర్వాత బెయిల్ వారికి మంజూరయ్యింది. ప్యారిస్కి చెందిన మీడియా రైట్స్ గ్రూప్ రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ (ఆర్ఎస్ఎఫ్), జరీమానాని 50,000 రియాల్స్ (130,000 డాలర్లు) నుంచి చాలా ఉపశమనం కల్పించినట్లు పేర్కొంది. అజ్మన్ న్యూస్ పేపర్ ఎడిటర్ ఇన్ చీఫ్ ఇబ్రహీమ్ అల్ మామారి, డిప్యూటీ చీఫ్ యూసుఫ్ అల్ హజ్లకు మూడేళ్ళ జైలు శిక్ష గతంలో ఖరారయ్యిందనీ, వారు గత సోమవారం విడుదలయ్యారని ఈ కేసులో మరో నిందితుడు జహెచ్ అల్ అబ్రి చెప్పారు. అబ్రి ఏడాదిపాటు జైలు శిక్షకు గురయ్యారు, 1,000 రియాల్స్ ఫైన్ ఈయనకూ విధించారు. ఆగస్ట్లో ఈయన్ని బెయిల్పై విడుదల చేశారు. వీరి అరెస్ట్ తర్వాత ఆ న్యూస్ పేపర్ పూర్తిగా మూతపడింది. జ్యుడీషియరీలో అవినీతి గురించి రాసిన వ్యాసమే వారి అరెస్టులకు కారణం. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ వర్గాల హెచ్చరికల్ని బేఖాతరు చేస్తూ ఇంటర్వ్యూని ప్రచురించడంతోనే ఈ ఘటన చోటుచేసుకుంది.
తాజా వార్తలు
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!







