ఇద్దరు జర్నలిస్టులకు బెయిల్‌

- October 12, 2016 , by Maagulf
ఇద్దరు జర్నలిస్టులకు బెయిల్‌

ఒమన్‌: ఒమన్‌ కోర్టు ఇద్దరు జర్నలిస్టులకు బెయిల్‌ మంజూరు చేసింది. విచారణ నవంబర్‌ 7కి వాయిదా వేసింది. ఇద్దరికీ 2,000 రియాల్స్‌ (5,195) పూచీ కత్తు సమర్పించిన తర్వాత బెయిల్‌ వారికి మంజూరయ్యింది. ప్యారిస్‌కి చెందిన మీడియా రైట్స్‌ గ్రూప్‌ రిపోర్టర్స్‌ వితౌట్‌ బోర్డర్స్‌ (ఆర్‌ఎస్‌ఎఫ్‌), జరీమానాని 50,000 రియాల్స్‌ (130,000 డాలర్లు) నుంచి చాలా ఉపశమనం కల్పించినట్లు పేర్కొంది. అజ్మన్‌ న్యూస్‌ పేపర్‌ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ ఇబ్రహీమ్‌ అల్‌ మామారి, డిప్యూటీ చీఫ్‌ యూసుఫ్‌ అల్‌ హజ్‌లకు మూడేళ్ళ జైలు శిక్ష గతంలో ఖరారయ్యిందనీ, వారు గత సోమవారం విడుదలయ్యారని ఈ కేసులో మరో నిందితుడు జహెచ్‌ అల్‌ అబ్రి చెప్పారు. అబ్రి ఏడాదిపాటు జైలు శిక్షకు గురయ్యారు, 1,000 రియాల్స్‌ ఫైన్‌ ఈయనకూ విధించారు. ఆగస్ట్‌లో ఈయన్ని బెయిల్‌పై విడుదల చేశారు. వీరి అరెస్ట్‌ తర్వాత ఆ న్యూస్‌ పేపర్‌ పూర్తిగా మూతపడింది. జ్యుడీషియరీలో అవినీతి గురించి రాసిన వ్యాసమే వారి అరెస్టులకు కారణం. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ వర్గాల హెచ్చరికల్ని బేఖాతరు చేస్తూ ఇంటర్వ్యూని ప్రచురించడంతోనే ఈ ఘటన చోటుచేసుకుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com