జమ్మూకశ్మీర్లో ఇద్దరు ముష్కరుల హతం
- October 12, 2016
జమ్మూకశ్మీర్లోని పాంపోర్లో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులకు తెరపడింది. ఔత్సాహిక పారిశ్రామికవేత్త అభివృద్ధి సంస్థ(ఈడీఐ) భవనంలోని సోమవారం ఉదయం చొరబడిన ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు భవనాన్ని చుట్టుముట్టి వారిపై ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఉగ్రవాదుల్ని తుదముట్టించేందుకు వీలుగా భద్రతా బలగాలు భవనాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ముష్కరులు తప్పించుకునేందుకు ఉన్న అన్ని మార్గాలను మూసివేసి వారిపై ఒత్తిడి పెంచారు.
ఇరువర్గాల మధ్య సుమారు 60 గంటల పాటు కాల్పులు జరిగాయి.
ఈడీఐ భవనాన్ని లక్ష్యంగా చేసుకుని ఫిబ్రవరి నెలలోనూ ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. 48గంటల పాటు సాగిన నాటి దాడిలో ఐదుగురు భద్రతా సిబ్బంది, ఓ ప్రభుత్వోద్యోగి ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు ఉగ్రవాదులను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







