జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు ముష్కరుల హతం

- October 12, 2016 , by Maagulf
జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు ముష్కరుల హతం

జమ్మూకశ్మీర్‌లోని పాంపోర్‌లో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులకు తెరపడింది. ఔత్సాహిక పారిశ్రామికవేత్త అభివృద్ధి సంస్థ(ఈడీఐ) భవనంలోని సోమవారం ఉదయం చొరబడిన ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు భవనాన్ని చుట్టుముట్టి వారిపై ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఉగ్రవాదుల్ని తుదముట్టించేందుకు వీలుగా భద్రతా బలగాలు భవనాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ముష్కరులు తప్పించుకునేందుకు ఉన్న అన్ని మార్గాలను మూసివేసి వారిపై ఒత్తిడి పెంచారు.

ఇరువర్గాల మధ్య సుమారు 60 గంటల పాటు కాల్పులు జరిగాయి.
ఈడీఐ భవనాన్ని లక్ష్యంగా చేసుకుని ఫిబ్రవరి నెలలోనూ ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. 48గంటల పాటు సాగిన నాటి దాడిలో ఐదుగురు భద్రతా సిబ్బంది, ఓ ప్రభుత్వోద్యోగి ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు ఉగ్రవాదులను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com