మొహర్రమ్ ప్రార్ధనలలో అపశృతి

- October 12, 2016 , by Maagulf
మొహర్రమ్ ప్రార్ధనలలో అపశృతి

మొహర్రమ్ ప్రార్ధనల్లో ఉన్న షియాలపై ఉగ్రవాదులు దాడి జరిపారు. ఈ దాడుల్లో 14 మంది చనిపోయారు. 36 మంది గాయపడ్డారు. ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లోని చారిత్రక షియా సాకీ మసీదు వద్ద ఈ దాడి జరిగింది. పెద్ద సంఖ్యలో ప్రార్ధనలు చేస్తున్న షియాలపై పోలీస్ యూనిఫామ్‌లో వచ్చిన ముగ్గురు ఉగ్రవాదులు దాడి చేశారు. విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. పేలుళ్లకు కూడా పాల్పడ్డారు. దాడికి పాల్పడ్డవారి ఉగ్రవాదులందరినీ చంపేశారా లేదా అనేది ఇంకా తెలియరాలేదు. సున్నీ తెగకు చెందిన తాలిబన్, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ప్రాధమికంగా నిర్ధారించారు. ఉగ్రదాడుల కారణంగా ప్రాణాలు కోల్పోయిన, గాయపడిన వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com