గౌరవమర్యాదలు, డబ్బు ఇచ్చింది తెలుగు పరిశ్రమే....
- October 12, 2016
ప్రభుదేవా, తమన్నా, సోనూసూద్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం 'అభినేత్రి'. విజరు దర్శకత్వం వహించారు. కోన ఫిలిం కార్పొరేషన్ సమర్పణలో ఎం.వి.వి. సినిమా పతాకంపై ఎం.వి.వి.సత్యనారాయణ బ్లూ సర్కిల్ కార్పొరేషన్, బి.ఎల్.ఎన్. సినిమాతో కలిసి ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మించారు. ఈ సినిమా ఇటీవల విడుదలైంది. దసరా రోజున హైదరాబాద్లో సక్సెస్ మీట్ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రేమ్రక్షిత్, శేఖర్, జానీ, దినేష్ మాస్టర్లు కలిసి ప్రభుదేవాను సత్కరించారు. దర్శకుడు ఎ.ఎల్.విజరు మాట్లాడుతూ 'పండక్కి మంచి విజయం అందించారు. మూడు భాషల్లోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. మెయిన్ పిల్లర్ కోన వెంకట్ చాలా బాగా చేశారు.
ప్రభు సపోర్ట్ మర్చిపోలేను' అని అన్నారు. ప్రభుదేవా మాట్లాడుతూ ''నేను ముంబైలో ఉంటే డైరెక్టర్ని అవుతాను. చెన్నైలో ఉంటే హీరో అవుతాను. హైదరాబాద్లో ఉంటే డ్యాన్స్ మాస్టర్ అవుతాను.నాకు గౌరవమర్యాదలు, డబ్బు ఇచ్చింది తెలుగు పరిశ్రమే. ఇక్కడ కూడా చాలా మంది కొరియోగ్రాఫర్లు అద్భుతంగా చేస్తున్నారు. పండక్కి మంచి విజయం దక్కింది. చాలా ఆనందంగా ఉంది.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







