ఇండిగో ప్రమోషనల్ ఆఫర్...
- October 13, 2016
విమాన యాన సంస్థ ఇండిగో ప్రమోషనల్ ఆఫర్ లో భాగంగా దేశీయ విమాన ఛార్జీలను భారీగా తగ్గించింది. అన్ని కలుపుకొని రూ.834 నుంచి ప్రారంభమయ్యే ధరలను అందిస్తోంది. ఎంపిక చేసిన డొమెస్టిక్ రూట్లలో ఈ తగ్గింపు ధరలను వర్తింప చేస్తున్నట్టు గురువారం ప్రకటించింది. ఈ ఆఫర్ అక్టోబర్ 17వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఇలా బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా అక్టోబర్ 30, 2016 నుంచి ఏప్రిల్ 13, 2017 ప్రయాణించాల్సి ఉంటుందని ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే ఈ ప్రమోషనల్ ఆఫర్ లో అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్యను మాత్రం ఇండిగో వెల్లడి చేయలేదు. అలాగే ఈ చార్జీలు నాన్ రిఫండబుల్ అని ఒక వేళ టికెట్లు క్యాన్సిల్ చేసుకుంటే చట్టబద్ధమైన పన్నులు మాత్రమే చెల్లించబడతాయని స్పష్టం చేసింది.
దీంతోపాటుగా ఈ పండుగ సీజన్ సందర్భంగా అక్టోబర్ నెలలో ప్రస్తుత నెట్ వర్క్ లో 47 కొత్త విమానాలను ప్రవేశపెడుతున్నట్టు ఇండిగో ప్రకటించింది.
కాగా ఇండిగో వెబ్ సైట్ లో చెక్ చేసినపుడు ఢిల్లీ-జైపూర్ టిక్కెట్ ఈ ప్రచార ఆఫర్ కింద రూ.867 ప్రారంభ ధరగా చూపిస్తోంది. ఢిల్లీ ముంబై టిక్కెట్ ధర నవంబర్ మధ్యలో ప్రయాణానికి రూ.2,030గా ఉంది.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







