పాకిస్తాన్‌లో రైల్లో బాంబు పేలింది.....

- October 13, 2016 , by Maagulf
పాకిస్తాన్‌లో  రైల్లో బాంబు పేలింది.....

 పాకిస్తాన్‌లో ఓ రైల్లో బాంబు పేలింది. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. రావిల్‌పిండి నుంచి క్వెట్టా వెళుతున్న రైల్లో ఉగ్రవాదులు టైం బాంబ్ పేల్చారు. బలూచిస్తాన్ ప్రావెన్స్ దగ్గర ఈ పేలుడు సంభవించింది. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పాక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com