వివేకవంతుడైన శిష్యుడు
- August 18, 2015
ఒక ఆశ్రమంలో గురువు గారి దగ్గర ఇద్దరు శిష్యులుండేవారు. వారిద్దరిలో తెలివైనవారు, జనానికి ఉపయోగపడేవాడు ఎవడో నిర్ణయించాలని తలచి గురువు వారికి ఒక పందెం పెట్టాడు. వారిద్దరికీ సమానంగా కొంత ధనం ఇచ్చి, శిష్యులారా! నేను మీకిస్తున్న ఈ ధనం చాలా చిన్న మొత్తం. మీరు దీన్ని ఖర్చు చేసి తద్వారా కొన్న వస్తువుతో ఈ గదినంతా నింపాలి అని చెప్పారు. అందుకు ఆ శిష్యులు సరేనని ఇద్దరు వేర్వేరు చోట్టకి వెళ్లి తమ దగ్గరున్న సొమ్ముతో వస్తువులు కొని తేవాలనుకున్నారు. వారిలో ఒక శిష్యుడు తన దగ్గరున్న డబ్బు వమొత్తాన్ని ఖర్చు చేసి ఎండుగడ్డిని కొని తెచ్చి గదంతా నిండబెట్టి గురువుగార్ని పిలిచి చూడమన్నాడు. గురువు వచ్చి చూసి మనసులో చిన్నగా నవ్వుకుని సమాధానం చెప్పకుండానే వెళ్లి పోయాడు. రెండవ శిష్యుడు తన దగ్గర ఉన్న ధనంలో కొంత మాత్రమే ఖర్చు చేసి ఒక దీపాన్ని కొని గదిలో పెట్టి వెలిగించాడు. గురువు అది చూసి గదంతా వెలుగుతో నింపావు. నీవే నలుగురికి మేలు చేయగలవు. నీ తెలివి తేటలు అమోఘం అనీ, నలుగురికి వెలుతురునిద్దామనుకునే నీ వివేకం గొప్పది అని అతన్ని అభినందించాడు. అందుకు మొదటి శిష్యుడు కొంత ముఖం చిన్నబుచ్చుకుని గురువు దగ్గర మరింత కాలం శిక్షణ పొందసాగాడు.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









