అబ్దుల్ కలాం కు నివాళులర్పించిన నరేంద్ర మోడీ
- October 15, 2016
భారత మాజీ రాష్ట్రపతి 'మిస్సైల్ మ్యాన్' ఏపీజే అబ్దుల్కలాం 85వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఆయనకు ట్విట్టర్ ద్వారా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రతి భారతీయుడికీ ఆదర్శనీయ వ్యక్తి అబ్దుల్ కలాం అంటూ మోదీ కొనియాడారు.
1931 అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరంలో అబ్దుల్ కలాం జన్మించారు. సాధారణ కుటుంబంలో పుట్టి భారత రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన ఆయనను ప్రభుత్వం పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న వంటి ప్రతిష్ఠాత్మక అవార్డులతో సత్కరించింది. మంచి వక్తగానే కాక 'వింగ్స్ ఆఫ్ ఫైర్', 'ఇగ్నైటెడ్ మైండ్స్' వంటి పుస్తకాలు రాసి గొప్ప రచియితగానూ పేరుపొందారు. 2015 జులై 27న గుండెపోటుతో కలాం కన్నుమూశారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







