నాగ్పూర్-సికింద్రాబాద్ రైళ్ల వేగం పెంపుపై అధ్యయనం..
- October 17, 2016
నాగ్పూర్-సికింద్రాబాద్ నగరాల మధ్య రైళ్ల వేగం గంటకు 200 కి.మీలకు పెంచడానికి సంబంధించి తొలి అడుగు పడింది. దీనిపై అధ్యయనానికి రష్యాతో ఒప్పందం కుదిరిందని సోమవారం కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. గోవాలో జరుగుతున్న బ్రిక్స్ సమావేశంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ల మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా ఈ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై భారత రైల్వే బోర్డు ప్రతినిధి నవీన్ కుమార్ శుక్లా, రష్యా రైల్వే శాఖ ప్రతినిధి బెలోజెరోవ్ సంతకాలు చేశారు.నాగ్పూర్-సికింద్రాబాద్ కారిడర్లో నడుస్తున్న రైళ్ల వేగాన్ని గంటకు 200 కిలోమీటర్లకు పెంచడానికి సాంకేతికంగా ఎదురయ్యే ఇబ్బందులు, అవరోధాలపై అధ్యయనం చేస్తారు. ఇందుకు అయ్యే ఖర్చును రెండు దేశాలు సమానంగా భరిస్తాయి.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









