కేబినెట్ నిర్ణయం.. ముసాయిదా తయారీకి ఆదేశం..
- October 18, 2016
ఆంధ్రప్రదేశ్కి కొత్త రెంట్ కంట్రోల్ చట్టాన్ని రూపొందించనున్నారు. ఈమేరకు మంగళవారం నాటి కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడిరాష్ట్రంలో 2011లో ఏపీ రెంట్ కంట్రోల్ చట్టాన్ని రూపొందించారు. రాష్ట్రం విడిపోయాక నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో అద్దెలు విపరీతంగా పెరిగాయి. ప్రభుత్వ అవసరాలకు తీసుకొనే భవనాలకు ప్రభుత్వం చదరపు అడుగుకు గరిష్ఠంగా రూ.30 అద్దె నిర్ణయించింది. కానీ, తరలింపులో భాగంగా సాధారణ ఉద్యోగులు, సామాన్య ప్రజలు అనేక మంది ఆంధ్రప్రదేశ్కు వస్తున్నారు.ఇదే అవకాశంగా నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలోని పల్లెల్లో సైతం అద్దెలు రూ.10వేలు దాటాయి. ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో నేటి కాలానికి అనుగుణంగా కొత్త చట్టం రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం 2011 నాటి ఏపీ రెంట్ కంట్రోల్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని నిర్ణయించారు. దాని స్థానంలో ఏపీ రెంట్ కంట్రోల్ చట్టం-2016ను రూపొందించనున్నారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









