కేబినెట్‌ నిర్ణయం.. ముసాయిదా తయారీకి ఆదేశం..

- October 18, 2016 , by Maagulf
కేబినెట్‌ నిర్ణయం.. ముసాయిదా తయారీకి ఆదేశం..

ఆంధ్రప్రదేశ్‌కి కొత్త రెంట్‌ కంట్రోల్‌ చట్టాన్ని రూపొందించనున్నారు. ఈమేరకు మంగళవారం నాటి కేబినెట్‌ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడిరాష్ట్రంలో 2011లో ఏపీ రెంట్‌ కంట్రోల్‌ చట్టాన్ని రూపొందించారు. రాష్ట్రం విడిపోయాక నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో అద్దెలు విపరీతంగా పెరిగాయి. ప్రభుత్వ అవసరాలకు తీసుకొనే భవనాలకు ప్రభుత్వం చదరపు అడుగుకు గరిష్ఠంగా రూ.30 అద్దె నిర్ణయించింది. కానీ, తరలింపులో భాగంగా సాధారణ ఉద్యోగులు, సామాన్య ప్రజలు అనేక మంది ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నారు.ఇదే అవకాశంగా నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలోని పల్లెల్లో సైతం అద్దెలు రూ.10వేలు దాటాయి. ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో నేటి కాలానికి అనుగుణంగా కొత్త చట్టం రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం 2011 నాటి ఏపీ రెంట్‌ కంట్రోల్‌ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని నిర్ణయించారు. దాని స్థానంలో ఏపీ రెంట్‌ కంట్రోల్‌ చట్టం-2016ను రూపొందించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com