24 ఏఎం స్టూడియోస్ బ్యానరుపై శివకార్తికేయన్ రెండవ సినిమా..
- October 18, 2016
'కాక్కిసట్టై' ద్వారా యాక్షన్ హీరోగా అడుగుపెట్టడంతోపాటు, పోలీసు అధికారిగా కూడా నటించి మెప్పించారు శివకార్తికేయన్. ఆయన మళ్లీ పోలీసుగా కనిపించి మరో యాక్షన్ వినోదాన్ని అందించేందుకు సిద్ధమవుతున్నారు. 24 ఏఎం స్టూడియోస్ బ్యానరుపై శివకార్తికేయన్ హీరోగా నటించిన 'రెమో' చిత్రం ఇటీవలే విడుదలైంది. ఇప్పుడు మళ్లీ అదే సంస్థ నిర్మాణంలో మరో సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మోహన్రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో శివకార్తికేయన్కు జంటగా తొలిసారిగా నయనతార నటిస్తున్నారు. నవంబరు 11 నుంచి చిత్రీకరణ ప్రారంభమవుతోంది. మలేషియా, పుణే, ముంబయి తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ చేయనున్నారు.ఇందులో శివకార్తికేయన్ కోసం పవర్ఫుల్ పోలీసు అధికారి పాత్రను రూపొందించారట మోహన్రాజా. రీమేక్లను వదిలిపెట్టి మోహన్రాజా దర్శకత్వం వహించిన తొలిచిత్రం 'తని ఒరువన్' కూడా పోలీసు కథతో రూపొందినదే. ఇప్పుడు మోహన్రాజా, శివకార్తికేయన్లు ఇద్దరూ పోలీసు కథతోనే ప్రేక్షకుల ముందుకు రానుండటం విశేషం.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









