లేబర్‌ వివాదాల కోసం ప్యానెల్‌ ఏర్పాటు

- October 20, 2016 , by Maagulf
లేబర్‌ వివాదాల కోసం ప్యానెల్‌ ఏర్పాటు

దోహా: కార్మికుల హక్కులను సంరక్షించేందుకుగాను 2004 - నెం.14 చట్టంలోని ప్రొవిజన్స్‌కి సవరణలు సూచిస్తూ డ్రాప్ట్‌ చట్టాన్ని స్టేట్‌ క్యాబినెట్‌ ఆమోదించింది. కార్మిక వివాదాలకు సంబంధించి జ్యుడీషియల్‌ ప్రొసిడ్యూర్స్‌ ఇంకా సులభతరమయ్యేలా ఈ సవరణలు ఉండనున్నాయి. వీటిలో కొన్ని ప్రొవిజన్లు, కమిటీ లేదా కమిటీల్ని ఏర్పాటు చేసి వాటి ద్వారా మినిస్ట్రీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ డెవలప్‌మెంట్‌, లేబర్‌ అండ్‌ సోషల్‌ ఎఫైర్స్‌ నుంచి వివాదాల్ని పరిష్కరించేందుకు వీలుగా రూపొందించబడ్డాయి. కోర్ట్‌ ఆఫ్‌ ఫస్ట్‌ ఇన్‌స్టాన్స్‌ నుంచి ఓ జడ్జ్‌ని ఈ కమిటీ కోసం నియమిస్తారు. ఆ న్యాయమూర్తి కమిటీకి నేతృత్వం వహిస్తారు. సుప్రీం జ్యుడీషియరీ కౌన్సిల్‌ ఆ జడ్జ్‌ని నియమిస్తుంది. మినిస్ట్రీ ఆఫ్‌ ఎడ్మినిస్ట్రేటివ్‌ డెవలప్‌మెంట్‌, లేబర్‌ మరియు సోషల్‌ ఎఫైర్స్‌ ఇద్దరు మినిస్ట్రీ అధికారుల్ని ఈ కమిటీ కోసం నియమిస్తుంది. వారు ఖచ్చితంగా అకౌంటింగ్‌లో అనుభవజ్ఞులై ఉంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com