లేబర్ వివాదాల కోసం ప్యానెల్ ఏర్పాటు
- October 20, 2016
దోహా: కార్మికుల హక్కులను సంరక్షించేందుకుగాను 2004 - నెం.14 చట్టంలోని ప్రొవిజన్స్కి సవరణలు సూచిస్తూ డ్రాప్ట్ చట్టాన్ని స్టేట్ క్యాబినెట్ ఆమోదించింది. కార్మిక వివాదాలకు సంబంధించి జ్యుడీషియల్ ప్రొసిడ్యూర్స్ ఇంకా సులభతరమయ్యేలా ఈ సవరణలు ఉండనున్నాయి. వీటిలో కొన్ని ప్రొవిజన్లు, కమిటీ లేదా కమిటీల్ని ఏర్పాటు చేసి వాటి ద్వారా మినిస్ట్రీ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ డెవలప్మెంట్, లేబర్ అండ్ సోషల్ ఎఫైర్స్ నుంచి వివాదాల్ని పరిష్కరించేందుకు వీలుగా రూపొందించబడ్డాయి. కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ నుంచి ఓ జడ్జ్ని ఈ కమిటీ కోసం నియమిస్తారు. ఆ న్యాయమూర్తి కమిటీకి నేతృత్వం వహిస్తారు. సుప్రీం జ్యుడీషియరీ కౌన్సిల్ ఆ జడ్జ్ని నియమిస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్మినిస్ట్రేటివ్ డెవలప్మెంట్, లేబర్ మరియు సోషల్ ఎఫైర్స్ ఇద్దరు మినిస్ట్రీ అధికారుల్ని ఈ కమిటీ కోసం నియమిస్తుంది. వారు ఖచ్చితంగా అకౌంటింగ్లో అనుభవజ్ఞులై ఉంటారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!
- సీఎం సమక్షంలో 124 మంది మావోయిస్టుల లొంగుబాటు
- క్షమించడండి అంటూ ఇరాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన
- *బ్రేకింగ్: విమాన సర్వీసులను పునరుద్ధరించిన ఎమిరేట్స్! కన్ఫర్మ్డ్ టికెట్ ఉన్న ప్రయాణీకులకే!
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు









