బస్ ఫేర్ కోసం ఆర్టిఎ స్మార్ట్ సిస్టమ్
- October 21, 2016
దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, కొత్తగా ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ (పిఓసి) అనే విధానం ద్వారా ప్రయాణీకులు పబ్లిక్ బస్ ట్రిప్లను ఎలాంటి కార్డులు లేకుండా వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తోంది. ఆర్టిఎ ఈ విషయాన్ని 36వ జిటెక్స్ టెక్నాలజీ వీక్లో వెల్లడించింది. బి ఇన్ - బి ఔట్ అనే కాన్సెప్ట్లో ఈ కొత్త విధానం ద్వారా టికెటింగ్ జరుగుతుంది. 'బిబో'గా దీన్ని పరిగణించనున్నారు. ఈ విధానం ద్వారా ప్రయాణీకుడు బస్లోకి స్మార్ట్ కార్డ్, స్మార్ట్ ఫోన్ని తన వద్ద ఉంచుకుంటే సరిపోతుంది. కార్డ్ని స్వైప్ చేయడం లేదా స్మార్ట్ ఫోన్ని వినియోగించడం చేయనక్కర్లేదు. బిబో సిస్టమ్ ఆ స్మార్ట్ కార్డ్ లేదా స్మార్ట్ ఫోన్ని రీడ్ చేసి, తనంతట తానుగా ఫేర్ని కలెక్ట్ చేస్తుంది. ఎన్ఓఎల్ కార్డు ద్వారా పంచ్ చేసే విధానానికి ఈ బిబో సిస్టమ్ ద్వారా చెక్ పెట్టవచ్చు. తద్వారా క్లియర్గా ఫేర్ కలెక్షన్ జరగడంతోపాటుగా సమయం కూడా వృధా అవకుండా ఉంటుంది. స్మార్ట్ దుబాయ్ ప్రాజెక్ట్లో భాగంగా ఈ స్మార్ట్ బిబో సిస్టమ్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







