క్రికెట్ లెజెండ్ కు "జీవిత సాఫల్య" పురస్కారం
- October 21, 2016
క్రికెట్ లెజెండ్ సునీల్ మనోహర్ గవాస్కర్ కి జీవిత సాఫల్య పురస్కారం అందించనున్నట్లు ముంబై జర్నలిస్టు క్రీడల సంఘం(ఎస్ జేఏఎమ్) ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్ 11న ఎస్ జేఏఎమ్ గోల్డెన్ జూబ్లీ వేడుకల పురస్కారానికి సునీల్ ను ఎంపిక చేసినట్లు తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. భారత్-ఇంగ్లాండ్ ల మధ్య జరగనున్న నాలుగో టెస్టు మ్యాచ్ చివరి రోజున వాంఖడే స్టేడియంలో సన్నీకు పురస్కారాన్ని ప్రధానం చేయనున్నట్లు చెప్పింది. 2013 సెప్టెంబర్ లో బాడ్మింటన్ లెజెండ్ నందూ నటేకర్ కు జీవిత సాఫల్య పురస్కారాన్ని మొదటిసారి ఎస్ జేఏఎమ్ ప్రధానం చేసింది. గవాస్కర్ కు భారత క్రికెట్ తో 50ఏళ్ల అనుబంధం ఉంది. 1966లో సన్నీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ గా వజీర్ సుల్తాన్ ఎలెవన్ తరఫున బరిలోకి దిగారు. 1970లో బొంబాయి తరఫున రంజీ ట్రోఫీలో పాల్గొన్నారు. 1970-71 మధ్య వెస్టిండీస్ టూర్ కు వెళ్లిన సన్నీ సిరీస్ లో 774 పరుగులు చేశారు. టెస్టు క్రికెట్ లో 10వేల పరుగుల క్లబ్ లో చేరిన తొలి క్రికెటర్ సునీల్ గవాస్కర్. 1983 వరల్డ్ కప్ సాధించిన టీమ్ లో సన్నీ కూడా ఉన్నారు. కెరీర్ లో 125 టెస్టు మ్యాచ్ లు ఆడిన సన్నీ 34 సెంచరీలతో 10,122 పరుగులు చేశారు. 108 వన్డే మ్యాచ్ ల్లో 3 వేల పరుగులు సాధించారు. 1987లో అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికారు. అప్పటినుంచి బీసీసీఐ టెక్నికల్ కమిటీ, ఐసీసీ క్రికెట్ కమిటీలకు చైర్మన్ గాను, ఐసీసీ మ్యాచ్ రిఫరీగాను, ముంబై క్రికెట్ సంఘానికి చైర్మన్ గాను, క్రికెట్ ఇంప్రూవ్ మెంట్ కమిటీలోనూ, భారత క్రికెట్ టీమ్ కు బ్యాటింగ్ కోచ్ గాను సేవలందించారు. 2014లో భారత్, యూఏఈల్లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లకు బీసీసీఐ ప్రెసిడెంట్ గా సుప్రీంకోర్టు సన్నీని నామినేట్ చేసింది.
తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









