మరోసారి వెంకీ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన తేజస్విని

- October 23, 2016 , by Maagulf
మరోసారి వెంకీ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన తేజస్విని

ఒక్కసారి.. ఇంకొక్కసారి అంటూ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబును టీజ్ చేసిన తేజస్వి మదివాడ.. మరోసారి వెంకటేష్ తో కలిసి నటించే ఛాన్స్ కొట్టేసింది. సీతమ్మ సినిమా తర్వాత వెంకటేష్ తో కలిసి నటించే అవకాశాన్ని మరోసారి దక్కించుకుంది ఈ తెలుగు బ్యూటీ.బాబు బంగారం' సినిమా తరువాత నుంచి వెంకటేష్ బాబు కాస్త దూకుడు పెంచాడు. వరుసగా సినిమాలను అంగీకరించడమే కాకుండా, సాధ్యమైనంత త్వరగా వాటిని పూర్తిచేయడానికి కూడా ప్రయత్నిస్తున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'గురు' రూపొందుతోంది.ఈ సినిమాను, సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.తరువాత ఆయన కిషోర్ తిరుమలతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఈ సినిమాకి 'ఆడాళ్లూ మీకు జోహార్లు' అనే టైటిల్ ను ఖరారు చేశారు. కథాపరంగా ఇందులో నలుగురు కథానాయికలతో వెంకటేష్ రొమాన్స్ చేయనున్నాడట.ఒక హీరోయిన్ గా నిత్యామీనన్ ను .. మరోహీరోయిన్ గా  అనసూయను సెలెక్ట్ చేసిన ఈ సినిమా టీమ్, తాజాగా 'తేజస్వి'ని మూడో హీరోయిన్ గా ఎంపిక చేసిందట.ఈ మూవీలో తన కంటే వయసులో చాలా చిన్నదైన అమ్మాయిని చేసుకోవాల్సి వచ్చే వ్యక్తిగా వెంకటేష్ నటించనున్నాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com