మరోసారి వెంకీ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన తేజస్విని
- October 23, 2016
ఒక్కసారి.. ఇంకొక్కసారి అంటూ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబును టీజ్ చేసిన తేజస్వి మదివాడ.. మరోసారి వెంకటేష్ తో కలిసి నటించే ఛాన్స్ కొట్టేసింది. సీతమ్మ సినిమా తర్వాత వెంకటేష్ తో కలిసి నటించే అవకాశాన్ని మరోసారి దక్కించుకుంది ఈ తెలుగు బ్యూటీ.బాబు బంగారం' సినిమా తరువాత నుంచి వెంకటేష్ బాబు కాస్త దూకుడు పెంచాడు. వరుసగా సినిమాలను అంగీకరించడమే కాకుండా, సాధ్యమైనంత త్వరగా వాటిని పూర్తిచేయడానికి కూడా ప్రయత్నిస్తున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'గురు' రూపొందుతోంది.ఈ సినిమాను, సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.తరువాత ఆయన కిషోర్ తిరుమలతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఈ సినిమాకి 'ఆడాళ్లూ మీకు జోహార్లు' అనే టైటిల్ ను ఖరారు చేశారు. కథాపరంగా ఇందులో నలుగురు కథానాయికలతో వెంకటేష్ రొమాన్స్ చేయనున్నాడట.ఒక హీరోయిన్ గా నిత్యామీనన్ ను .. మరోహీరోయిన్ గా అనసూయను సెలెక్ట్ చేసిన ఈ సినిమా టీమ్, తాజాగా 'తేజస్వి'ని మూడో హీరోయిన్ గా ఎంపిక చేసిందట.ఈ మూవీలో తన కంటే వయసులో చాలా చిన్నదైన అమ్మాయిని చేసుకోవాల్సి వచ్చే వ్యక్తిగా వెంకటేష్ నటించనున్నాడు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







