దీపావళికి బోనస్ రూపంలో ఈ ఖరీదైన నజరానా....
- October 28, 2016
దీపావళి పండుగ వచ్చిందంటే చాలు.. గుజరాత్..సూరత్లోని డైమండ్ మర్చంట్ సావ్ జీ ధోలాకియా సంస్థలో పని చేసే సిబ్బంది ఎగిరి గంతేస్తారు. ఈ పండుగకు బోనస్ గా ఈ వ్యాపారి... వారికి ఈసారి వెయ్యికి పైగా కొత్త కార్లు, 400 ప్లాట్లు కానుకగా అందజేయనున్నారు. హరేకృష్ణ ఎక్స్ పోర్ట్స్ ఓనర్ అయిన సావ్ జీ.. తమ సంస్థలో ఉత్తమ ఉద్యోగులుగా ఎంపికైన వారికి ఈ నజరానాలు అందజేయనున్నారు.ఈ సంవత్సరం 1716 మంది ఉద్యోగులను బెస్ట్ ఎంప్లాయీస్ గా గుర్తించినట్టు ఆయన చెప్పారు. ప్రతి సంవత్సరం ఇలా ఆయన దీపావళికి బోనస్ రూపంలో ఈ ఖరీదైన నజరానాలను అందజేస్తున్నారు. ఇప్పటికే కార్లు ఉండి..సొంత అపార్ట్ మెంట్లు లేనివారికి అపార్ట్ మెంట్లను, ఫ్లాట్లు ఉండి కార్లు లేనివారికి కార్లను ఇస్తున్నట్టు ఆయన తెలిపారు.1100 చదరపు అడుగుల ఫ్లాట్ ఒక్కొక్కటి 15 లక్షలు ఖరీదు చేస్తుందని, అయిదేళ్ళ తరువాత ఉద్యోగులు నెలకు 11 వేలు చెల్లిస్తే సరిపోతుందని ఆయన చెప్పారు. గత ఏడాది ఈ సంస్థ తమ సిబ్బందికి 491 కార్లను, 200 ఫ్లాట్లను అందజేసింది.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







