మృతదేహాల తరలింపుకు చర్యలు ముమ్మరం చేసిన అబుధాబి
- October 28, 2016
అబుదాబిలో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు పూర్తి సహకారం అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. త్వరితగతిన మృతదేహాలను స్వదేశానికి తీసుకొచ్చేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని కేటీఆర్ సూచించారు. ఘటన నాటి నుంచి తమ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు. ఈనెల 19న అబుదాబిలోని రీమ్ ఐలాండ్లో ఉన్న లేబర్ క్యాంప్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సుమారు 16 గదులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. వలస కార్మికులు గాఢనిద్రలో ఉండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గల్ఫ్ డూన్స్ లాండ్ స్కేపింగ్ అండ్ అగ్రికల్చర్ సర్వీసెస్ కంపెనీలో పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐదుగురు వలస కార్మికులు ఈ ఘటనలో మృతిచెందారు.
మరణించిన వారిని రాకేష్, పిట్ల నరేష్, ప్రకాశ్ మలావత్, ముచ్చిండ్ల నరేష్, గాండ్ల అభిలేష్గా గుర్తించారు. మృతుల కుటుంబాలను తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు.
శేఖర్ మల్యాల(అబుధాబి)
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







