మృతదేహాల తరలింపుకు చర్యలు ముమ్మరం చేసిన అబుధాబి
- October 28, 2016
అబుదాబిలో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు పూర్తి సహకారం అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. త్వరితగతిన మృతదేహాలను స్వదేశానికి తీసుకొచ్చేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని కేటీఆర్ సూచించారు. ఘటన నాటి నుంచి తమ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు. ఈనెల 19న అబుదాబిలోని రీమ్ ఐలాండ్లో ఉన్న లేబర్ క్యాంప్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సుమారు 16 గదులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. వలస కార్మికులు గాఢనిద్రలో ఉండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గల్ఫ్ డూన్స్ లాండ్ స్కేపింగ్ అండ్ అగ్రికల్చర్ సర్వీసెస్ కంపెనీలో పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐదుగురు వలస కార్మికులు ఈ ఘటనలో మృతిచెందారు.
మరణించిన వారిని రాకేష్, పిట్ల నరేష్, ప్రకాశ్ మలావత్, ముచ్చిండ్ల నరేష్, గాండ్ల అభిలేష్గా గుర్తించారు. మృతుల కుటుంబాలను తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు.
శేఖర్ మల్యాల(అబుధాబి)
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







