తమ మధ్య నెలకొన్న విబేధాలను పరిష్కరించుకునే దిశగా భారత్-చైనాలు.
- October 29, 2016విధ అంశాలపై తమ మధ్య నెలకొన్న విబేధాలను పరిష్కరించుకునే దిశగా భారత్-చైనాలు అడుగులు వేస్తున్నాయి. అందులో భాగంగానే రెండు దేశాలకు చెందిన జాతీయ భద్రతా సలహాదారులు నవంబరు మొదటి వారంలో సమావేశం కానున్నారు. ఎన్ఎస్జీలో భారత్ సభ్యత్వం, జైష్ ఎ మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్పై ఐరాస నిషేధాన్ని అడ్డుకోవడానికి చైనా ప్రయత్నాలు, దాదాపు 46 బిలియన్ అమెరికన్ డాలర్ల వ్యయంతో చైనా నిర్మించ తలపెట్టిన చైనా-పాక్ ఆర్థిక కారిడార్(సీపీసీ)పై భారత్ నిరసనతో పాటు పలు అంశాలు వీరి మధ్య చర్చకు రానున్నాయి. భారత్ జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్, చైనా జాతీయ భద్రత సలహాదారు యాంగ్ జియేచిలు హైదరాబాద్లో సమావేశమవుతారు.ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పరిస్థితిపై అధికారికంగా చర్చలు జరుపుతారు. ప్రత్యేకించి ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధికి ఆటంకంగా ఉన్న చికాకులపై చర్చలు జరుగుతాయని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!