తమ మధ్య నెలకొన్న విబేధాలను పరిష్కరించుకునే దిశగా భారత్-చైనాలు.
- October 29, 2016
విధ అంశాలపై తమ మధ్య నెలకొన్న విబేధాలను పరిష్కరించుకునే దిశగా భారత్-చైనాలు అడుగులు వేస్తున్నాయి. అందులో భాగంగానే రెండు దేశాలకు చెందిన జాతీయ భద్రతా సలహాదారులు నవంబరు మొదటి వారంలో సమావేశం కానున్నారు. ఎన్ఎస్జీలో భారత్ సభ్యత్వం, జైష్ ఎ మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్పై ఐరాస నిషేధాన్ని అడ్డుకోవడానికి చైనా ప్రయత్నాలు, దాదాపు 46 బిలియన్ అమెరికన్ డాలర్ల వ్యయంతో చైనా నిర్మించ తలపెట్టిన చైనా-పాక్ ఆర్థిక కారిడార్(సీపీసీ)పై భారత్ నిరసనతో పాటు పలు అంశాలు వీరి మధ్య చర్చకు రానున్నాయి. భారత్ జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్, చైనా జాతీయ భద్రత సలహాదారు యాంగ్ జియేచిలు హైదరాబాద్లో సమావేశమవుతారు.ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పరిస్థితిపై అధికారికంగా చర్చలు జరుపుతారు. ప్రత్యేకించి ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధికి ఆటంకంగా ఉన్న చికాకులపై చర్చలు జరుగుతాయని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!
- తెలంగాణకు కొత్త గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా..
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్









