ఈజిప్ట్ వరదల్లో చిక్కుకుని 22 మంది మృతి
- October 31, 2016
ఈజిప్టులో ఇటీవల సంభవించిన వరదల్లో 22 మంది మృతి చెందగా 72 మంది తీవ్రంగా గాయపడినట్టు ఆదేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. నాలుగు ప్రావిన్సులను వరదలు అతలాకుతలం చేసినట్టు హోంమంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి ఖాలెద్ మెఘాహెద్ తెలిపారు. గతవారం కుదిపేసిన ఈ వరదల దాటికి దక్షిణ సినాయ్, ఎర్ర సముద్రం, సోహాగ్, బని సూయెఫ్ ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నట్టు ఆయన పేర్కొన్నారు. వరదల కారణంగా వేలాదిమంది నిరాశ్రయులైనట్టు వివరించారు. రాజ్ ఘరెబ్ నగరంలో వందలాది కార్లు కొట్టుకుపోయినట్టు తెలిపారు. సహాయకార్యక్రమాల కోసం మిలటరీని రంగంలోకి దించినట్టు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







