ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి 'సెంటినరీ' అవార్డు

- November 01, 2016 , by Maagulf
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి 'సెంటినరీ' అవార్డు

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. కేంద్ర ప్రభుత్వం నుంచి మరో పురస్కారాన్ని అందుకోనున్నాడు. చలన చిత్ర రంగంలో చేసిన విశేష కృషి గానూ సెంటినరీ అవార్డుతో కేంద్రప్రభుత్వం ఆయన్ను సత్కరించనుంది. ఈ అవార్డును గోవాలో జరుగనున్న 47వ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టింల్(ఐఎఫ్ఎఫ్ఐ-2016) లో ప్రధానం చేయనున్నట్లు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో భాషల్లో సుమారు 40వేలకు పైగా పాటలను బాలసుబ్రహ్మణ్యం పాడాడు. ఇప్పటికే పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులను అందుకున్న బాలుకి ఈ అవార్డు రావడం పట్ల పలువురు సినీ ప్రముఖులు అభినందనలు తెలిపారు. 47వ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ ఈ నెల 20 నుంచి 28 వరకూ గోవాలో జరుగనున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com