అఫ్గాన్ లో వైమానిక దాడులు, 30 మంది మృతి

- November 03, 2016 , by Maagulf
అఫ్గాన్ లో వైమానిక దాడులు, 30 మంది మృతి

అఫ్గానిస్థాన్‌లోని కుందుజ్‌ ఉత్తర ప్రావిన్స్‌లో నాటో దళాలు చేసిన వైమానిక దాడిలో మహిళలు, చిన్నారులు సహా 30 మంది పౌరులు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. గురువారం కుందుజ్‌లో తాలిబన్లకు వ్యతిరేకంగా జరిపిన ఆపరేషన్‌లో ఇద్దరు అమెరికా సైనికులు, ముగ్గురు అఫ్గాన్‌ ప్రత్యేక దళ అధికారులు చనిపోయిన తర్వాత ఈ వైమానిక దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 30 మంది అఫ్గాన్‌ పౌరులు చనిపోగా మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు.
మృతి చెందిన వారిలో మూడు నెలల వయసున్న పిల్లలు కూడా ఉన్నారు. దీంతో దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులు గవర్నర్‌ కార్యాలయం ఎదుట ఆందోళనలు చేపట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com