సాధారణ స్థితికి వచ్చిన అమ్మ..
- November 03, 2016
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సాధారణ స్థితికి వచ్చినట్లు గురువారం అధికార అన్నాడీఎంకే వెల్లడించింది. జయలలిత ఆహారాన్ని సైతం తీసుకుంటున్నట్లు పార్టీ నాయకురాలు సీఆర్ సరస్వతి తెలిపారు. ఆమె ప్రస్తుతం సాధారణ జీవితాన్ని గడుపుతున్నారని పేర్కొన్నారు. అన్నాడీఎంకే అధికార ప్రతినిధి పన్రుత్తి ఎస్.రామచంద్రన్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఆరోగ్యం మెరుగైనట్లు తెలిపారు. ప్రజల ప్రార్థనలు ఫలించాయని ఆనందం వ్యక్తం చేశారు.
అమ్మకు నటి శారద పరామర్శ
ముఖ్యమంత్రి జయలలితను సీనియర్ నటి ఊర్వశి శారద గురువారం ఉదయం అపోలో ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు.
అమ్మ ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శారద మీడియాతో మాట్లాడుతూ.. జయలలితను చూడటానికి బాధగా వెళ్లానని, అయితే డాక్టర్ల మాటలు విన్నాక చాలా ఆనందంగా ఉందన్నారు. అనారోగ్యానికి గురైన ముఖ్యమంత్రి జయలలిత 45 రోజులుగా చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









