భారత్‌లో పర్యటించనున్నా బ్రిటన్‌ ప్రధాని...

- November 03, 2016 , by Maagulf
భారత్‌లో పర్యటించనున్నా బ్రిటన్‌ ప్రధాని...

 బ్రిటన్‌ ప్రధానమంత్రి థెరెసా మే 6వ తేదీ (ఆదివారం) నుంచి 3 రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు. యూరోపియన్‌ యూనియన్‌ వెలుపల ఆమె జరుపుతున్న మొట్టమొదటి ద్వైపాక్షిక పర్యటన ఇదే కావటం విశేషం. పెట్టుబడులు, వాణిజ్యం పుంజుకోవటానికి థెరెసా పర్యటన తోడ్పడగలదని భావిస్తున్నారు. భారత పర్యటన సందర్భంగా ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఆమె సోమవారం మోదీతో కలిసి భారత్‌-యూకే టెక్‌ శిఖరాగ్ర సదస్సునూ ఆరంభిస్తారని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి వికాస్‌ స్వరూప్‌ తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com