అంగరంగ వైభవంగా యూఏఈ ఫ్లాగ్ డే
- November 03, 2016
దుబాయ్: నవంబర్ 3వ తేదీన యూఏఈ ఫ్లాగ్ డే సందర్భంగా జాతీయ జెండాలు కనువిందు చేశాయి. ఎక్కడికక్కడ జాతీయ జెండాలు దర్శనమివ్వడంతో దేశభక్తి ఉప్పొంగింది యూఏఈ ప్రజల్లో. స్కూళ్ళు, ప్రభుత్వ సంస్థల కార్యాలయాలు, మినిస్ట్రీస్కి చెందిన కార్యాలయాల్లో ఘనంగా జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమాలు జరిగాయి. దుబాయ్లోని జబీల్ పార్క్లో వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూఏఈ మరియు దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ జాతీయ జెండాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 20,000 మంది విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 120 దేశాలకు చెందిన విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. సోషల్ మీడియాలోనూ వేలాదిమంది యూఏఈ జాతీయ పతాకాన్ని తమ ప్రొఫైల్స్లో పెట్టారు. దేశవ్యాప్తంగా ఫ్లాగ్ డే సెలబ్రేషన్స్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని షేక్ మొహమ్మద్ ఇచ్చిన పిలుపు మేరకు, ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా చారిత్రక ఘట్టంగా నిర్వహించారు. 200 మందితో కలిసి వాకథాన్ కూడా నిర్వహించారు. అబుదాబీలోని అల్ జజిరా క్లబ్ నుంచి నేషనల్ థియేటర్ వరకు ఈ కార్యక్రమం జరిగింది. మినిస్టర్ ఆఫ్ కల్చర్ అండ్ నాలెడ్జ్ డెవలప్మెంట్ షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







