అంగరంగ వైభవంగా యూఏఈ ఫ్లాగ్ డే
- November 03, 2016
దుబాయ్: నవంబర్ 3వ తేదీన యూఏఈ ఫ్లాగ్ డే సందర్భంగా జాతీయ జెండాలు కనువిందు చేశాయి. ఎక్కడికక్కడ జాతీయ జెండాలు దర్శనమివ్వడంతో దేశభక్తి ఉప్పొంగింది యూఏఈ ప్రజల్లో. స్కూళ్ళు, ప్రభుత్వ సంస్థల కార్యాలయాలు, మినిస్ట్రీస్కి చెందిన కార్యాలయాల్లో ఘనంగా జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమాలు జరిగాయి. దుబాయ్లోని జబీల్ పార్క్లో వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూఏఈ మరియు దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ జాతీయ జెండాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 20,000 మంది విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 120 దేశాలకు చెందిన విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. సోషల్ మీడియాలోనూ వేలాదిమంది యూఏఈ జాతీయ పతాకాన్ని తమ ప్రొఫైల్స్లో పెట్టారు. దేశవ్యాప్తంగా ఫ్లాగ్ డే సెలబ్రేషన్స్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని షేక్ మొహమ్మద్ ఇచ్చిన పిలుపు మేరకు, ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా చారిత్రక ఘట్టంగా నిర్వహించారు. 200 మందితో కలిసి వాకథాన్ కూడా నిర్వహించారు. అబుదాబీలోని అల్ జజిరా క్లబ్ నుంచి నేషనల్ థియేటర్ వరకు ఈ కార్యక్రమం జరిగింది. మినిస్టర్ ఆఫ్ కల్చర్ అండ్ నాలెడ్జ్ డెవలప్మెంట్ షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









