ఎలుకల దాడిలో పసికందు మృతిపై హెచార్సీ సీరియస్ అయ్యింది

- August 26, 2015 , by Maagulf
ఎలుకల దాడిలో పసికందు మృతిపై హెచార్సీ సీరియస్ అయ్యింది

గుంటూరు జిల్లాలో ఎలుకల దాడిలో పసికందు మృతిపై హెచార్సీ సీరియస్ అయ్యింది. ఓ న్యాయవాది ఈ ఘటనపై పిటిషన్ దాఖలు చేశారు. డీఎంఅండ్ హెచ్ఓ, సూపరింటెండెంట్ లకు హెచ్చార్సీ నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 11వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొంది. తల్లి ఆక్రందన.. ఇదిలా ఉంటే పసికందు మృతి చెందడంపై తల్లి పడుతున్న ఆవేదన పలువురిని కలిచివేస్తోంది. తమ బిడ్డను ఇంకా తీసుకపోనియడం లేదని టెన్ టివితో వాపోయింది. ప్రమాదం జరిగిన తరువాత కూడా ఎవరూ వచ్చి చూడలేదని తెలిపింది. ఎలుకలు వస్తున్నాయి..దాడి చేస్తున్నాయని పేర్కొన్నా ఎవరూ స్పందించలేదని రోదిస్తూ తెలిపింది. తనను హేళన చేస్తూ మాట్లాడరని, పేదోళ్లం కాబట్టే ఇంతదూరం వచ్చి ఆసుపత్రిలో చేరామని పేర్కొంది. మ బాబును మాకు ఇప్పించాలని ఆ తల్లి వేడుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com