ఇరాక్లో ఆత్మాహతి దాడులు 21 మంది మృతి
- November 06, 2016
ఇరాక్లోని టిక్రిట్, సమారా ప్రాంతాల్లో ఆదివారం జరిగిన రెండు ఆత్మాహతి దాడుల్లో 21 మంది మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. టిక్రిట్లోని రద్దీ ప్రాంతంలో ముష్కరులు అంబులెన్స్లో వచ్చి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 13 మంది మృతిచెందారు. ఇది జరిగిన కొద్దిసేపటికే సమారాలోని కార్ పార్కింగ్ వద్ద ఇదే తరహాలో అంబులెన్స్తో మరో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 8 మంది మృతిచెందారు. ఈ రెండు ఘటనల్లో వందల మంది గాయపడటంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో రెండు నగరాల్లో కర్ఫ్యూ విధించినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







