3 లక్షల డి హెచ్ చోరీ చేసిన ఇరువురు డుబై విమానాశ్రయ కార్మికులు
- November 07, 2016
దుబాయ్ : ఫ్లై దుబాయ్ విమానంలో వచ్చిన ఒక భారతీయ వ్యక్తి తన జీవితంలో పొదుపు చేసుకొన్న మూడు కవర్లలో మిలియన్ డి హెచ్ మొత్తాన్ని దాచుకోగా, తన బ్యాగ్ నుండి ఒక కవరు తప్పిపోయినట్లుగా గుర్తించాడు. భారతదేశానికి చెందిన బాధితుడు (36) చోరీకి గురికాబడిన డి హెచ్ 286,522 విలువ చేసే కవరు మొత్తం డి హెచ్ 1,078,000 నుండి పోగొట్టుకోవాల్సి వచ్చింది. "నేను సౌదీ అరేబియా నుండి గత ఏడాది అక్టోబర్ 5 వ తేదీన ఇక్కడకు వచ్చి ఆ డబ్బు ఉన్న కవరు ని పోగొట్టుకున్నట్లు వివరించాడు. మూడు ఎన్విలప్లు కవర్లలోడబ్బు ఉండగా అందులో ఒక కవరులో ఉన్న కొంత డబ్బు మాయమైనట్లు తాను విమానాశ్రయంలో ఉండగానే గుర్తించినట్లు ఆ వ్యక్తి దుబాయ్ క్రిమినల్ కోర్ట్ లో చెప్పారు. అందులో ఒక కవరుని ఎవరో తెరిచి పాడు చేసినట్లు, అందులో డబ్బుని దొంగలించి తిరిగి దానిని అతికించే యత్నం చేసినట్లు గుర్తులు లభ్యమైనట్లు ఆయన తెలిపారు. ఈ దొంగతనం చేసిన వారిలో బంగ్లాదేశీయుడు (28) మరియు ఒక ఘనానియన్ (29) వీరిద్దరూ విమానాశ్రయంలో సామాను నిర్వహించేవారు వారికి ఈ నేరానికి బాధ్యులుగా పోలీసులు అనుమానించారు. ఈ సంఘటన తర్వాత బంగ్లాదేశీ అక్టోబర్ 6 ప్రారంభ న ఒక విమాన టికెట్ తీసుకొని, దేశం వదిలి పారిపోయే యత్నం చేశాడు.పోలీసుల విచారణలో ఘనా దేశానికి చెందిన వ్యక్తి బాధితుడి బ్యాగ్ తెరిచిన బాంగ్లాదేశ్ వ్యక్తి ఒక కవరు బయటకు లాగి అది తన బట్టలు కింద దాచడం తాను చూసినట్లు చెప్పాడు. ఈ దొంగతనానికి పాల్పడిన ఈ ఇరువురిపై తీర్పు నవంబర్ 28 న వెలువడుతుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







