శత్రువులకి పిండం పెట్టిన ఘనత పృధ్వీకే దక్కింది..
- November 07, 2016
టాలీవుడ్ స్టార్ కమెడియన్ గా దూసుకెళ్తున్నాడు థర్టీ ఇయర్స్ పృధ్వీ. ఈ మధ్య వస్తోన్న చిత్రాల్లో పృధ్వీ హంగామా ఎక్కువైంది. బాయిలింగ్ స్టార్ బబ్లు, ఫ్యూచర్ స్టార్ సిద్దప్ప, మల్లెపుష్పం రామారావు, ఇగో రెడ్డి .. పాత్రలతో హల్ చల్ చేశాడు. అదే సమయంలో తనకు శత్రువులు ఎక్కువయ్యారని పృధ్వీ ఫీలవుతున్నట్టు కనిపిస్తోంది. తాజాగా, ఫేస్ బుక్ లో పృధ్వీ పోస్ట్ చేసిన ఓ పిక్ ని చూస్తే ఇదే నిజమనిపిస్తోంది.
తల్లిదండ్రులకి పిండాలు పెడుతోన్న పిక్ ఒకటి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాదు పృధ్వీ. ఇది సినిమా పిక్ కాదండోయ్. నిజంగానే పిండాలు పెట్టాడు. ఈ పిక్ క్రింద తల్లి దండ్రులతో పాటుగా.. శత్రువులకి కూడా పెడుతున్నాని కామెంట్ పెట్టాడు.ఇప్పుడీ కామెంట్ హాట్ టాపిక్ గా మారింది. పృధ్వీకి శత్రువులెరబ్బా.. అంటూ ఆరాతీయడం మొదలైంది ఫిల్మ్ నగర్ వర్గాల్లో.అయితే, ఈ మధ్య పెళ్లి చేసుకుని మోసం చేసాడంటూ ఫృధ్వీపై పోలీస్ కేసు నమోదైన విషయం తెలిసిందే. పృథ్వీ ఎదుగుదలను చూసి తట్టుకోలేక అతడిపై కొంతమంది కుట్ర చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదంతా కుట్రలో భాగమని ఫీలవుతున్న పృధ్వీ.. శత్రువులకి కూడా పిండం పెడుతున్నట్టు పోస్ట్ పెట్టాడు. ఏదేమైనా.. శత్రువులకి పిండం పెట్టిన ఘనత పృధ్వీకే దక్కింది.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







