బ్రిటన్ ప్రధాని థెరిసా నేడు బెంగళూరు పర్యటించనున్నారు..
- November 07, 2016
బ్రిటన్ ప్రధానమంత్రి థెరిసా మే మంగళవారం బెంగళూరులో పర్యటించనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆరు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం 7.45 గంటలకు దిల్లీలో బయలు దేరి 10.30 గంటలకు నగరానికి చేరుకుంటారు. ఇక్కడి ఒక హోటల్లో సీఎం సిద్ధరామయ్యతో సమావేశమవుతారు. అనంతరం 11.50 గంటలకు యలహంక సమీపంలోని స్టోనహళ్లి (తరహుణసే) ప్రభుత్వపాఠశాలను సందర్శిస్తారు. మధ్యా హ్నం 12.05 గంటలకు డైనమిక్స్ టెక్నాలజి సంస్థ కార్యాయలానికి చేరుకుంటారు. రక్షణ, వైమానిక సంస్థలకు ఇది విడి భాగాల్ని సరఫరా చేస్తుంది. బ్రిటన్లోనూ దీనికి మూడు శాఖలున్నాయి. సాయంత్రం 3 గంటలకు మహాత్మాగాంధీ రోడ్డు బార్టన్ సెంటర్లో కొందరు ప్రముఖులతో సమావేశమవుతారు.అనంతరం హలసూరులోని సోమేశ్వరాలయాన్ని సందర్శిస్తారు. 5 గంటలకు దిల్లీకి బయలుదేరి వెళతారు.
తాజా వార్తలు
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం









