బ్రిటన్ ప్రధాని థెరిసా నేడు బెంగళూరు పర్యటించనున్నారు..
- November 07, 2016
బ్రిటన్ ప్రధానమంత్రి థెరిసా మే మంగళవారం బెంగళూరులో పర్యటించనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆరు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం 7.45 గంటలకు దిల్లీలో బయలు దేరి 10.30 గంటలకు నగరానికి చేరుకుంటారు. ఇక్కడి ఒక హోటల్లో సీఎం సిద్ధరామయ్యతో సమావేశమవుతారు. అనంతరం 11.50 గంటలకు యలహంక సమీపంలోని స్టోనహళ్లి (తరహుణసే) ప్రభుత్వపాఠశాలను సందర్శిస్తారు. మధ్యా హ్నం 12.05 గంటలకు డైనమిక్స్ టెక్నాలజి సంస్థ కార్యాయలానికి చేరుకుంటారు. రక్షణ, వైమానిక సంస్థలకు ఇది విడి భాగాల్ని సరఫరా చేస్తుంది. బ్రిటన్లోనూ దీనికి మూడు శాఖలున్నాయి. సాయంత్రం 3 గంటలకు మహాత్మాగాంధీ రోడ్డు బార్టన్ సెంటర్లో కొందరు ప్రముఖులతో సమావేశమవుతారు.అనంతరం హలసూరులోని సోమేశ్వరాలయాన్ని సందర్శిస్తారు. 5 గంటలకు దిల్లీకి బయలుదేరి వెళతారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







