తీవ్రరూపం దాల్చనున్న నీటికొరత - మొదటి పది స్థానాల్లో ఉన్న యు.ఏ.ఈ.
- August 27, 2015
2040 నాటికీ, 33 మధ్య ప్రాచ్య దేశాల్లో సగానికి పైగా తీవ్ర నీటి కరువునెదుర్కోనున్నట్టు, వాటిలో మొదటి పది దేశాల్లో యు.ఏ.ఈ. ఉందని, 167 దేశాలను సర్వే చేసిన నిపుణులు తెలియజేశారు. 13 మధ్య ప్రాచ్య దేశాలు మరియు పాలస్తీనా రాజ్యాలు రానున్న 25 సంవత్సరాలలో నీతి ఎద్దడిని చవిచూస్తాయని, వాటిలో బహ్రైన్, కువైట్, పాలస్తీనా రాజ్యాలు, కతార్, యూ. ఏ. ఈ., ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, ఒమాన్ వంటివి మొదటి 10 స్థా నాలాక్రమిస్తున్నాయి. సగటున ఒక యు. ఏ. ఈ. నివాసి రోజుకు 550 లీటర్ల నీటిని వాడతా డు. ఇది ప్రపంచ సగటు కంటే 3 రెట్లు అధికం; ఇక, లవణాలు తీసివేయబడిన సముద్రజలం, భూగర్భాజలం, ఇంకా శుద్ధి చేయబడిన వాడుక నీరు వంటివి యు. ఏ. ఈ. నీటి వనరులు. అయినప్పటికీ, 2030 నాటికీ భూగర్భజలం తగ్గిపోనున్న నేపధ్యంలో నీటి వాడకాన్ని తగ్గించేలా చర్యలను తీసుకోవడం మంచిదని ప్రపంచ వనరుల సంస్థ డైరక్టర్ బెట్సీ ఒట్టో తెలిపారు. ఐతే నీటి కొరత వల్ల వల్ల సిరియా వంటి దేశాల్లో తలెత్తిన తిరుగుబాటు, ఇక్కడ కూడా సంభవించే ప్రమాదంపై ఇప్పుడు వేడివేడి రాజకీయ చర్చలు సాగుతున్నాయి.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







