పాకిస్థాన్ నుంచి తమ దౌత్యవేత్తలను భారత్ వెనక్కి పిలిపించింది..
- November 08, 2016
పాకిస్థాన్ నుంచి తమ దౌత్యవేత్తలను భారత్ వెనక్కి పిలిపించింది. ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్లో సేవలందిస్తున్న అధికారులు అనురాగ్సింగ్, విజయ్కుమార్ వర్మ, మాధవన్ నందకుమార్లు మంగళవారం స్వదేశానికి పయనమయ్యారు. మహమూద్ అక్తర్తోపాటు మరికొంతమంది పాక్ దౌత్యవేత్తలు.. భారత్లో గూఢచర్యానికి పాల్పడ్డట్లుగా గత నెలలో తేలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి పేర్లు బహిర్గతం కావడంతో పాక్ వారిని వెనక్కిపిలిపించింది. ఇటు ప్రతీకార చర్యగా ఎనిమిది మంది భారత దౌత్యవేత్తలపై కూడా గూఢచర్య, ఉగ్రవాద సంబంధ ఆరోపణలు మోపుతూ పాక్ వివరాలు వెల్లడించింది. దీంతో భారత్ కూడా తమ దౌత్యవేత్తలను వెనక్కిరప్పించేందుకు చర్యలు తీసుకుంది.
మరో ఐదుగురు అధికారులు వాఘా సరిహద్దు ద్వారా రహదారి మార్గంలో భారత్కు రానున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







