డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైతే ఇండియాకు ప్రయోజనమే....!
- November 09, 2016
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్థి, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కన్నా దూసుకుపోతున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైతే ఇండియాకు ప్రయోజనమే కలుగుతుందని భారతీయులు భావిస్తున్నారు. ఇండియాలో ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అమేజింగ్ గా ఉన్నాయని, యూఎస్ లోని ట్రెడిషనల్ పొలిటిషియన్స్ కన్నా ఈయన భిన్నంగా..భారతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఉన్నారని చాలామంది భావిస్తున్నారు. ముఖ్యంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ పట్ల ట్రంప్ కఠినంగా మాట్లాడడం, హిల్లరీతో పోలిస్తే ఈ విషయంపై దూకుడుగా వ్యాఖ్యానించడం గమనించదగినదని వారు అంటున్నారు. క్రాస్ బార్డర్ టెర్రరిజాన్ని ఆయన బహిరంగంగా ఖండించడం విశేషమని పేర్కొంటున్నారు.
ట్రంప్ రాజకీయవేత్త కాదు.. రాజకీయంగా ఆయనకు ఎలాంటి అనుభవమూ లేదు. కానీ ఆయన ప్రసంగాలు మాత్రం ఆయన రాజకీయ పరిణతను సూచిస్తున్నాయి. ఎన్నో ప్రచార సభల్లో ఆయన భారత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రశంసించారు. ఇండియాలో ఏక పన్ను విధానాన్ని ప్రవేశపెట్టిన మోదీ ఇతర దేశాలకు ఆదర్శప్రాయుడయ్యారు అని మనస్ఫూర్తిగా వ్యాఖ్యానించారు అని ఇండియాలోని వారేగాక ప్రవాస భారతీయులు కూడా పేర్కొన్నారు. కాగా హిల్లరీ అప్పుడే ఇండియాపట్ల ప్రతికూల వైఖరి అనుసరిస్తున్నారని, ఉగ్రవాదులకు తన స్వచ్చంద సంస్థ ద్వారా కోట్లాది డాలర్ల నిధుల సాయాన్ని అందజేస్తూ పరోక్షంగా భారత వ్యతిరేకవాదాన్ని పాటిస్తున్నారని వీరు అభిప్రాయపడుతున్నారు. తనను ఇస్లాం అనుకూలవాదిగా హిల్లరీ నిరూపించుకుంటున్నారని, గతంలో ఆమె పంపిన ఈ-మెయిల్స్ దీన్ని సూచిస్తున్నాయని భారతీయులు పేర్కొంటున్నారు. తాను గెలిస్తే అమెరికాలోని భారతీయులు, ముస్లిముల ప్రయోజనాలకు కృషి చేస్తానని ట్రంప్ పదేపదే హామీ ఇచ్చారు. అప్పుడప్పుడు.. ముఖ్యంగా మొదట్లో ఆయన ఇండియాకు వ్యతిరేకంగా మాట్లాడి ఉండవచ్చు.. కానీ ఆ తరువాత ఆయన ధోరణి భారత్ పట్ల అనుకూలంగా మారుతూ వచ్చింది అన్నది వీరి ఒపీనియన్.. తాజాగా ట్రంప్ గెలవాలని కోరుతూ ముంబైలో ప్రవాస భారతీయుల చొరవతో ఓ ఆలయంలో పూజారులు, పండితులు హోమాలు చేయడం విశేషం.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







