భారత్‌కి తిరిగి వచ్చిన దౌత్యాధికారులు...

- November 10, 2016 , by Maagulf
భారత్‌కి తిరిగి  వచ్చిన దౌత్యాధికారులు...

భారత దేశ ఇంటెలిజెన్స్‌ బ్యూరోకి గూఢచారులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ 8 మంది దౌత్యాధికారుల పేర్లను బయట పెట్టిన పాకిస్థాన్‌ వారిని భారతదేశానికి తిరిగి పంపింది. ఈ క్రమంలో గురువారం ఐదుగురిని భారత్‌కి పంపినట్లు అధికారులు, మీడియా సంస్థలు వెల్లడించాయి. 8 మందిలో ముగ్గురు భారత్‌కు సోమవారం చేరుకోగా మిగిలిన ఐదుగురు ఈరోజు భారత్‌కి తిరిగి వచ్చారు.దిల్లీ పోలీసులు అరెస్టు చేసిన ఓ ఐఎస్‌ఐ అధికారి విచారణ సమయంలో వెల్లడించిన ఆధారాల మేరకు గూఢచర్యం ఆరోపణలతో దిల్లీలోని పాకిస్థాన్‌ హైకమిషనర్‌ కార్యాలయం అధికారి అక్తర్‌, మరో ఉద్యోగిని భారత్‌ నవంబరు 2న తిరిగి వెళ్లిపోవాల్సిందిగా కోరింది.దీనికి సమాధానంగా పాకిస్థాన్‌ కూడా 8 మంది భారత దౌత్యాధికారులు గూఢచర్యం చేస్తున్నారంటూ ఆరోపించి వారిని తిప్పి పంపించింది

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com