'ఎల్‌ఐసీ' పాలసీదారులకు వెసులుబాటు

- November 16, 2016 , by Maagulf
'ఎల్‌ఐసీ' పాలసీదారులకు వెసులుబాటు

జీవిత బీమా సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎల్‌ఐసీ) తన పాలసీదారులకు వెసులుబాటు కల్పించింది. రూ.500, వెయ్యి నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. నిత్యావసరాల కోసం నగదు కావాలంటేనే సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇక ఎల్‌ఐసీ ప్రీమియం చెల్లించాల్సిన వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. దీంతో నవంబర్‌ 9 నుంచి 30 మధ్య కాలంలో ప్రీమియం చెల్లించాల్సిన పాలసీదారులకు ఎల్‌ఐసీ అదనపు గడువును ఇచ్చింది. నవంబర్‌ 30లోగా ప్రీమియం చెల్లిస్తే ఎలాంటి అదనపు రుసుములు విధించబోమని తెలిపింది. .

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com