గోవాలో 'ఫిలిం ఫెస్టివల్' ప్రారంభం
- November 20, 2016
గోవాలోని పనాజీలో 47వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) అట్టహాసంగా ప్రారంభమైంది. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ప్రారంభమైన ఈ కార్యక్రమానికి దేశవిదేశాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. యూపీలో జరిగిన పట్నా-ఇండోర్ ఎక్స్ప్రెస్ ఘోర రైలు ప్రమాద మృతులకు కార్యక్రమ ప్రారంభోత్సవంలో నిమిషం పాటు మౌనం పాటించి నివాళులర్పించారు. కార్యక్రమ ప్రాంగణమంతా దేశ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబించే విధంగా తయారు చేశారు. ఆవరణలో ఇరువైపు ఏర్పాటు చేసిన త్రీడీ కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రముఖ కళాకారుడు మరియా మిరండా ఈ త్రీడీ కటౌట్లను తయారుచేశారు.తొమ్మిది రోజుల పాటు సాగనున్న ఈ చిత్రోత్సవం ఈనెల 28న ముగియనుంది. కార్యక్రమానికి హాజరైన ప్రేక్షకులను అలరించేందుకు 21వ తేదీ నుంచి ప్రతి రోజు సాయంత్రం ఏడు గంటలకు భారతీయ చిత్రాలను ప్రదర్శించనున్నారు. ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన మగధీర చిత్రం ప్రదర్శించనున్నారు. సైరాట్, నటసామ్రాట్, మగధీర, బాజీరావ్ మస్తానీ, సుల్తాన్, ఎయిర్లిఫ్ట్, షోలే చిత్రాలను మిర్మర్ బీచ్ ఓపెన్ ఎయిర్ స్క్రీనింగ్ మీద ప్రదర్శిస్తారు.
దేశవిదేశాల నుంచి సినీ ఔత్సాహికులు ఈ చిత్రోత్సవానికి హాజరవుతారు. దాదాపు 90 దేశాలకు చెందిన 200 చిత్రాలను ప్రదర్శిస్తారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







