తగ్గుతున్న బంగారం, వెండి ధరలు
- November 20, 2016
పెద్ద నోట్ల రద్దు.. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో ఒక్కసారిగా పసిడి, వెండి రేట్లకు రెక్కలు వచ్చాయి.. 32,500 లకు చేరుకొన్నది.. దీంతో బంగారం ధరకు రెక్కలు వచ్చాయి. రోజు రోజుకీ బంగారం ధర పెరిగిపోతుంది అని అందరూ భావించారు. కానీ గత నాలుగు రోజులుగా పసిడి, వెండి ధరలు గ్రాముకు రూ.250 పతనమైంది. ప్రస్తుతం మేలిమి బంగారం ధర 29,500 లకు చేరుకొన్నది. ఇక వెండి కూడా కేజీకు రూ.2,500 తగ్గింది.. దీంతో 42,500 లైంది. ఇలా ధర తగ్గడానికి ముఖ్య కారణం పెద్ద నోట్ల రద్దు.. వ్యాపారులు పాత పెద్ద నోట్లను తీసుకోకపోవడం... ఒక కారణం అయితే.. డెబిట్ కార్డు, కొత్త నోట్ల కొనుగోలు కూడా పెద్దగా లేవని అందుకనే బంగారం డిమాండ్ తగ్గిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన అయినప్పటికీ చేతిలో కొత్త నోట్లు లేకపోవడమే కారణం.. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనడంతో డిమాండ్ ఒక్కసారిగా తగ్గి ధర పతనానికి కారణమైంది. అలాగే మరికొన్ని రోజులు కొనసాగితే బంగారం రూ.26వేలకు చేరువ కావచ్చునని బులియన్ వర్గాలు భావిస్తున్నాయి.
తాజా వార్తలు
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!









