తగ్గుతున్న బంగారం, వెండి ధరలు

- November 20, 2016 , by Maagulf
తగ్గుతున్న బంగారం, వెండి ధరలు

పెద్ద నోట్ల రద్దు.. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో ఒక్కసారిగా పసిడి, వెండి రేట్లకు రెక్కలు వచ్చాయి.. 32,500 లకు చేరుకొన్నది.. దీంతో బంగారం ధరకు రెక్కలు వచ్చాయి. రోజు రోజుకీ బంగారం ధర పెరిగిపోతుంది అని అందరూ భావించారు. కానీ గత నాలుగు రోజులుగా పసిడి, వెండి ధరలు గ్రాముకు రూ.250 పతనమైంది. ప్రస్తుతం మేలిమి బంగారం ధర 29,500 లకు చేరుకొన్నది. ఇక వెండి కూడా కేజీకు రూ.2,500 తగ్గింది.. దీంతో 42,500 లైంది. ఇలా ధర తగ్గడానికి ముఖ్య కారణం పెద్ద నోట్ల రద్దు.. వ్యాపారులు పాత పెద్ద నోట్లను తీసుకోకపోవడం... ఒక కారణం అయితే.. డెబిట్ కార్డు, కొత్త నోట్ల కొనుగోలు కూడా పెద్దగా లేవని అందుకనే బంగారం డిమాండ్ తగ్గిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన అయినప్పటికీ చేతిలో కొత్త నోట్లు లేకపోవడమే కారణం.. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనడంతో డిమాండ్‌ ఒక్కసారిగా తగ్గి ధర పతనానికి కారణమైంది. అలాగే మరికొన్ని రోజులు కొనసాగితే బంగారం రూ.26వేలకు చేరువ కావచ్చునని బులియన్ వర్గాలు భావిస్తున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com