పాట్నా ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదంలో 145కి చేరిన మృతుల సంఖ్య
- November 21, 2016
కాన్పూర్ సమీపంలో ఇండోర్, పాట్నా ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 145కు చేరింది. మృతుల్లో 123 మందిని ఇప్పటి వరకు గుర్తించారు. 110 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరికొందరు ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. మరోవైపు, ఈ ప్రమాదంపై ఫోరెన్సిక్ విచారణకు ఆదేశించినట్టు రైల్వే మంత్రి సురేష్ ప్రభు తెలిపారు. ప్రమాదానికి కారణం ఏమిటనేది ఈ విచారణలో తేలుతుందన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. ప్రమాద ఘటన తర్వాత తీసుకున్న సహాయక చర్యలపై ఆయన లోక్ సభలో ప్రకటన చేశారు.
.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









