అమెరికాలో ఘోర బస్సు ప్రమాదం...
- November 21, 2016
అమెరికాలో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. టెనస్సీ లోని ఓ పాఠశాలకు చెందిన బస్సు చెట్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రాణాంతకమైన ప్రమాదంలో పలువురు చిన్నారులు మృత్యువాత పడినట్టు తెలుస్తోంది. కిండర్ గార్టెన్ , ప్రాథమిక పాఠశాల విద్యార్థులు 35 మందితో వెళ్తుండగా ఈ విషాదం చోటు చేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యల్ని చేపట్టారు. గాయపడిన చిన్నారులను స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఎంతమంది మరణించారనేది ఇపుడే చెప్పలేమని, తీవ్ర గాయాలపాలైన 20 మందిని ఆసుపత్రికి తరలించినట్టు ఛత్తనూగ పోలీసు అధికారి ట్రేసీ ఆర్నాల్డ్ తెలిపారు. అయితే ఎక్కువమంది చనిపోయి వుంటారని భావిస్తున్నామన్నారు.
మరోవైపు హామిల్టన్ కౌంటీ ప్రాసిక్యూటర్ కార్యాలయం ఆరుగురు చనిపోయారని నివేదించింది. సుమారు 12 మంది పిల్లలు చనిపోయారని స్థానిక మీడియా వెల్లడించింది. దీనిపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









