స్వదేశీ పృథ్వీ-2 క్షిప ణుల ప్రయోగం విజయవంతం...
- November 21, 2016
స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన రెండు స్వదేశీ పృథ్వీ-2 క్షిపణులను డీఆర్డీవో సోమవారం విజయవంతంగా పరీక్షించింది. అణ్వాయుధ సామర్థ్యంకలిగిన ఈ క్షిపణులను ఒడిసాలోని చాందీపూర్లో పరీక్షించారు. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే ఈ క్షిపణులు 350 కిలోమీట ర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు. వీటిని 500కిలోల నుంచి వెయ్యి కిలోల బరువున్న అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యంతో తయారుచేశారు. ఐటీఆర్లో ని కాంప్లెక్స్-3 నుంచి మొబైల్ లాంచర్ ద్వారా ఒకదాని వెంట మరొకటి చొప్పున వీటిని ప్రయోగించినట్లు రక్షణశాఖ వర్గా లు వెల్లడించాయి. కాగా, 2009లోనూ ఇదేతరహాలో రెండు క్షిపణులను వెంటవెంటనే ప్రయోగించి పరీక్షించిన విషయం తెలిసిందే!
ట్విన్ ఇంజన్ల ద్వారా పనిచేసే ఈ క్షిపణులలో లక్ష్యాన్ని ఛేదించేందుకు ప్రత్యేకంగా అడ్వాన్స్డ్ ఇనర్షియల్ గైడెన్స్ వ్యవస్థను పొందుపరిచారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







