12 మంది ఉగ్రవాదుల హతం
- November 23, 2016
ఆఫ్గనిస్తాన్లో తాలిబాన్ ఉగ్రవాదులకు గట్టి ఎందురుదెబ్బ తగిలింది. భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్లో బుధవారం 12 మంది ఉగ్రవాదులు హతమయ్యారని ఆ దేశ రక్షణ శాఖ వెల్లడించింది.
ఆఫ్గన్ ఆర్మీ, పోలీసులు, పర్సనల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ సంయుక్తంగా 24 గంటల వ్యవధిలో ఈ ఆపరేషన్ను నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఆపరేషన్లో 23 మంది ఉగ్రవాదులు గాయపడ్డారని వెల్లడించారు. ఉగ్రవాదుల నుంచి భారీగా ఆయుధాలను సైతం స్వాధీనం చేసుకున్నట్లు జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది. మృతి చెందిన 12 మంది ఉగ్రవాదుల్లో 8 మంది హెల్మండ్ ప్రావిన్సులోని లష్కర్ ఘా పట్టణం శివార్లలో నిర్వహించిన ఆపరేషన్ లో మృతి చెందినట్లు తెలుస్తోంది.ఇటీవలి కాలంలో తాలిబాన్ ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఆఫ్గన్ సైన్యం చర్యలు ముమ్మరం చేసింది.
తాజా వార్తలు
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?







