సౌదీలో స్టాండర్డ్ ఇండియన్ వర్కర్స్కి చిన్ని ఆశ
- November 25, 2016
సౌదీ ఒగెర్ మరియు సాద్ గ్రూప్ తదితర నిర్మాణ సంస్థల్లో పనిచేస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయ వలసదారులను ఆదుకునేందుకు తగు చర్యలు తీసుకుంటామని సౌదీ అరేబియా, భారత ప్రభుత్వానికి భరోసా ఇచ్చింది. లోక్సభలో మినిస్టర్ ఆఫ్ ఎక్సటర్నల్ ఎఫైర్స్ వికె సింగ్ చెబుతూ, సౌదీ అరేబియా, భారతీయ కార్మికుల ఎగ్జిట్ వీసాలను ఎక్స్టెండ్ చేయనున్నట్లు ప్రకటించిందనీ, అలాగే వన్ వే రిటర్న్ టికెట్ని ఇవ్వనున్నట్లు తెలిపిందనీ, రెసిడెంట్ పర్మిట్ జరీమానాల్ని ఎత్తివేయనున్నట్లు చెప్పిందనీ ఓ ప్రశ్నకు సమాధానంగా వివరించారు. భారతీయ కార్మికుల్ని ఆదుకునేందుకు తగు రీతిలో సహాయ సహకారాలు అందిస్తామని భారత ప్రభుత్వానికి సౌదీ ప్రభుత్వం తెలిపిందని చెప్పారాయన. రిపాట్రియేషన్ ఇప్పటికే ప్రారంభమైందనీ 4,358 మంది ఇప్పటికే స్వదేశానికి వచ్చారని సింగ్ చెప్పారు. కాగా ఖతార్లో వందలాదిమంది కార్మికులు ఇంకా ఎలాంటి పేమెంట్స్ లేకుండా ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. కోచి, హైద్రాబాద్, గురుగ్రామ్, చెన్నయ్, లక్నోలలో మైగ్రెంట్ రిసోర్స్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తున్నారు.
తాజా వార్తలు
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!
- తెలంగాణకు కొత్త గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా..
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్









