నోట్ల రద్దుపై ఎన్ఆర్ఐలకు ఎస్బిఐ ఉన్నతాధికారుల సమాధానాలు
- November 29, 2016
మస్కట్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) ఉన్నతాధికారులు, పెద్ద నోట్ల రద్దు అనంతరం ఏర్పడ్డ పరిస్థితులపై ఎన్ఆర్ఐల అనుమానాల్ని నివృత్తి చేయనున్నారు. గురువారం ఈ మేరకు మీటింగ్ జరగనుంది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఎన్ఆర్ఐలు తమ వెంట పాత రద్దు చేయబడిన కరెన్సీని తీసుకెళ్ళడం ఇబ్బందికరంగా మారింది. అలాగే మనీ ఎక్స్ఛేంజ్లోనూ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇంటర్ కాంటినెంటల్ మస్కట్లో సాయంత్రం 6.30 నిమిషాల నుంచి ఈ సమావేశం జరగనుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్ మేనేజింగ్ డైరెక్టర్ సిఆర్శశి కుమార్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైద్రాబాద్ మేనేజింగ్ డైరెక్టర్ శాంతను ముఖర్జీ, ఎన్ఆర్ఐ సర్వీసెస్ - ఎస్బి - ముంబై జనరల్ మేనేజర్ పికె మిశ్రా తదితరులు ఈ సమావేశంలో పాల్గొంటారని గ్లోబల్ మనీ ఎక్స్ఛేంజ్ జనరల్ డైరెక్టర్ మధుసూదన్ చెప్పారు.
తాజా వార్తలు
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!









