యూఏఈ అమరవీరుల్ని స్మరించుకున్న షేక్‌ మొహమ్మద్‌

- November 29, 2016 , by Maagulf
యూఏఈ అమరవీరుల్ని స్మరించుకున్న షేక్‌ మొహమ్మద్‌

యూఏఈ కమ్మెమరేషన్‌ డే సందర్భంగా వైస్‌ ప్రెసిడెంట్‌ మరియు ప్రైమ్‌ మినిస్టర్‌ ఆఫ్‌ యూఏఈ, దుబాయ్‌ రూలర్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌, దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల్ని స్మరించుకున్నారు. సివిల్‌, మిలిటరీ, హ్యుమానిటేరియన్‌ విభాగాల్లో ప్రాణాలు కోల్పోయినవారికి ఈ సందర్బంగా షేక్‌ మొహమ్మద్‌ ఘన నివాళులర్పించారు. ప్రతి సంవత్సరం నవంబర్‌ 30వ తేదీన అమరవీరుల త్యాగాల్నీ, వారి ధైర్య సాహసాల్ని గుర్తు చేసుకుంటూ కమ్మెమరేషన్‌ డే నిర్వహించుకోవడం జరుగుతోంది. యూఏఈ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌కి సంబంధించిన వివిధ విభాగాల్ని, సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్స్‌నీ ఈ సందర్భంగా షేక్‌ మొహమ్మద్‌ అభినందించారు. అమరవీరుల వారసులుగా మనల్ని మనం గొప్పగా చెప్పుకునే రోజు ఇదనీ, ప్రతి ఒక్కరూ దేశం కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని షేక్‌ మొహమ్మద్‌ చెప్పారు. అమరవీరుల కుటుంబాలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన వివరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com