యూఏఈ అమరవీరుల్ని స్మరించుకున్న షేక్ మొహమ్మద్
- November 29, 2016
యూఏఈ కమ్మెమరేషన్ డే సందర్భంగా వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూఏఈ, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల్ని స్మరించుకున్నారు. సివిల్, మిలిటరీ, హ్యుమానిటేరియన్ విభాగాల్లో ప్రాణాలు కోల్పోయినవారికి ఈ సందర్బంగా షేక్ మొహమ్మద్ ఘన నివాళులర్పించారు. ప్రతి సంవత్సరం నవంబర్ 30వ తేదీన అమరవీరుల త్యాగాల్నీ, వారి ధైర్య సాహసాల్ని గుర్తు చేసుకుంటూ కమ్మెమరేషన్ డే నిర్వహించుకోవడం జరుగుతోంది. యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించిన వివిధ విభాగాల్ని, సెక్యూరిటీ డిపార్ట్మెంట్స్నీ ఈ సందర్భంగా షేక్ మొహమ్మద్ అభినందించారు. అమరవీరుల వారసులుగా మనల్ని మనం గొప్పగా చెప్పుకునే రోజు ఇదనీ, ప్రతి ఒక్కరూ దేశం కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని షేక్ మొహమ్మద్ చెప్పారు. అమరవీరుల కుటుంబాలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







